పట్నా 25 జూన్ (హి.స.) కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోమంత్రి అమిత్షా (Amit Shah) ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) ప్రకటించిన అత్యవసర పరిస్థితి (National Emergency) జాతీయ అవసరం కాదని.. కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేక మనస్తత్వానికి అది ప్రతీక అని అమిత్ షా ఆరోపించారు. కేవలం తన పదవిని కాపాడుకోవడానికి మాత్రమే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1975, జూన్ 25న అత్యవసర పరిస్థితిని విధించారన్నారు. ఆ సమయంలో దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించివేశారని, న్యాయవ్యవస్థ చేతులు కట్టేశారని, సామాజిక కార్యకర్తలను జైళ్లలో బంధించారని షా పేర్కొన్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారని తెలిపారు. ప్రభుత్వం నియంతలా మారినప్పుడు, దానిని పడగొట్టే శక్తి ప్రజలకు ఉంటుందని ఈ రోజు అందరికీ గుర్తు చేస్తోందని షా అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ