ముంబై, 25 జూన్ (హి.స.)
బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. తులం పసిడి ధర లక్ష మార్కు దాటి పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే బంగారం ధర రెండు రోజుల నుంచి దిగివస్తూ కాస్త ఊరటనిస్తోంది. కాగా.. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అటు వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. అయితే.. బులియన్ మార్కెట్లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. వీటి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. జూన్ 25 2025 బుధవారం ఉదయం వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.99,210 ఉండగా.. 22 క్యారెట్ల ధర 90,940 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,08,900లుగా ఉంది. బంగారం తులంపై రూ.10, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. అయితే.. ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి