నిమ్మరసం కలిపిన చియా సీడ్స్ నీరు.. తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలు.. తెలిస్తే..
అమరావతి, 25 జూన్ (హి.స.) ప్రతి ఒక్కరూ శరీరంలో సరైన మెటబాలిజం కోసం తరచూ సరైన మోతాదులో నీళ్లు తాగుతూ ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోతాయి. శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అయితే, ఇంట్లో మనం రోజూ తాగే నీటికి బదులుగా
నిమ్మరసం కలిపిన చియా సీడ్స్ నీరు.. తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలు.. తెలిస్తే..


అమరావతి, 25 జూన్ (హి.స.)

ప్రతి ఒక్కరూ శరీరంలో సరైన మెటబాలిజం కోసం తరచూ సరైన మోతాదులో నీళ్లు తాగుతూ ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల శరీరం నుంచి వ్యర్థాలు తొలగిపోతాయి. శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అయితే, ఇంట్లో మనం రోజూ తాగే నీటికి బదులుగా, అందులో చియా విత్తనాలు, నిమ్మరసం యాడ్‌ చేసుకోవటం వల్ల నీటి రుచి పెరుగుతుంది. పైగా ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం, చియా విత్తనాలను తాగడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం..

నిమ్మరసం, చియా విత్తనాలను నీటిలో కలిసి తీసుకోవటం వల్ల అద్భుతమైన హైడ్రేటింగ్ పానీయంగా పనిచేస్తుంది. ఈ నీటిలో తక్కువ కేలరీలు ఉంటాయి. దీనికి నిమ్మకాయ జోడించినప్పుడు, ఇది వ్యాయామం తర్వాత మీ శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. ఆరోగ్యకరమైన బూస్ట్ కోసం ఇది సరైన రోజువారీ పానీయం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande