పట్నా: 25 జూన్ (హి.స.) రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పట్నాలో మంగళవారం విలేకరుల సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి రామచంద్ర పూర్వే ఈ మేరకు ప్రకటించారు. లాలూ ఒక్కరే ముందురోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని, పరిశీలనలో అవి సక్రమంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వచ్చేనెల 5న జాతీయ కౌన్సిల్ సమావేశంలో లాలూ పాల్గొంటారని, ఆరోజే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. 28 ఏళ్ల ఆర్జేడీ పార్టీకి తిరిగి లాలూనే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో.. ఆ పార్టీని ఒకే కుటుంబం నియంత్రిస్తోందని అధికార పార్టీ ఎన్డీఏ ఎద్దేవా చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ