ముంబయి: , 25 జూన్ (హి.స.)ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం శాంతించడం దలాల్ స్ట్రీట్లో ఉత్సాహాన్ని నింపింది. అటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు కూడా సూచీల సెంటిమెంట్ను బలపర్చాయి. దీంతో బుధవారం దేశీయ మార్కెట్లు (Stock Market) లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ (Sensex) 400 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ (Nifty) మళ్లీ 25,100 మార్క్ దాటింది.
ఉదయం 9.25 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 458.84 పాయింట్ల లాభంతో 82,513.95, నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 25,173.45 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 86.00గా ఉంది. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, ఎన్టీపీసీ, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు రాణిస్తుండగా.. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ