ఢిల్లీ మెట్రో స్టేషన్‌ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
ఢిల్లీ 25 జూన్ (హి.స.): ఢిల్లీలో భారీ అ‍గ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రిఠాలా మెట్రోస్టేషన్‌ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చ
ఢిల్లీ మెట్రో స్టేషన్‌ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి


ఢిల్లీ 25 జూన్ (హి.స.): ఢిల్లీలో భారీ అ‍గ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రిఠాలా మెట్రోస్టేషన్‌ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్‌ సమీపంలో ఉన్న పాలిథీన్‌ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి మంటల చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande