రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాల్లో ACB రెయిడ్స్..
హైదరాబాద్, 26 జూన్ (హి.స.) రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులతో ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పక్కగా ట్రాప్ చేసి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యా
Acb


హైదరాబాద్, 26 జూన్ (హి.స.)

రాష్ట్రంలో ఏసీబీ అధికారులు వరుస దాడులతో ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పక్కగా ట్రాప్ చేసి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాలు, సరిహద్దుల్లోని చెకోపోస్టు లపై ఏక కాలంలో దాడులు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరి మరియు కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని రోడ్డు రవాణా కార్యాలయాలను కలుపుకుని ఏకంగా 18 ఆఫీసులపై మూకుమ్మడిగా అవినీతి నిరోధక శాఖ అధికారుల రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఈ మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, ఆర్టీవో ఏజెంట్ల ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయాలపై ఏసీబీ అధికారుల మెరుపు దాడులు చేశారు. ఏకంగా కార్యాలయం గేట్ మూసివేసి తిరుమలగిరిలో 10, ఉప్పల్లోమరో 10 మంది ఆర్టీవో ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ పరిణామంతో ఆర్టీవో కార్యాలయం పరిధిలో అప్పటి వరకు గుమిగూడిన ఏజెంట్లు అంతా.. అక్కడి నుంచి పరారయ్యారు. ఇక అయితే, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వాహనదారులు ఆకస్మిక ఏసీబీ రెయిడ్స్ కారణంగా కార్యాలయం ఎదుట వారు కొన్ని గంటలుగా వేచిచూస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande