రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, 26 జూన్ (హి.స.) 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అయినా పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేక పోతున్నారన
ఎమ్మెల్సీ కవిత


హైదరాబాద్, 26 జూన్ (హి.స.) 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అయినా పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు. అప్పు కావాలని ఆర్ఎసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక పోతున్నాడని విమర్శించారు.

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారని చెప్పారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడకి పోతుందో ప్రజలకు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇవ్వాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande