హైదరాబాద్, 26 జూన్ (హి.స.) ఆషాఢమాస బోనాల సంబురం సందర్భంగా లంగర్ హౌజ్ చౌరస్తాలో గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుపున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా భక్తులతోపాటు నృత్యం చేస్తూ వారిని పొన్నం ప్రభాకర్ ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన , సీపీ సీవీ ఆనంద్ ,కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కూడా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు..అనంతరం మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఆషాడ మాసంలో హైదరాబాద్లోని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న బోనాల సంబురాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..