ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలి.. కిషన్ రెడ్డి డిమాండ్
తెలంగాణ, నిజామాబాద్. 26 జూన్ (హి.స.) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 29న నిజామాబాద్ లో జరిగే కేంద్
కిషన్ రెడ్డి


తెలంగాణ, నిజామాబాద్. 26 జూన్ (హి.స.)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈనెల 29న నిజామాబాద్ లో జరిగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన ఆయన బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పదే పదే ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడుతూ సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయాన్ని కిషన్ రెడ్డి సందర్భంగా గుర్తు చేశారు. తీరా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ ను తుంగలో తొక్కి వేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande