అమరావతి, 26 జూన్ (హి.స.)
తమ తదుపరి గమ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం అని ( కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్లోని 22 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి సహకారం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ