తెలంగాణ, నిజామాబాద్.26 జూన్ (హి.స.)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా 29న పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక సంవత్సరాల పసుపు రైతుల ఆకాంక్ష బోర్డుతో నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అనేక రాజకీయ పార్టీలు హామీ ఇచ్చినా అర్వింద్ కృషి వల్ల ప్రధాని మోడీ ఆశీస్సులు ఆదేశాలతో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్త కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాదు లోనే బోర్డు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఇతర రాష్ట్రాలు కోరినా మోడీ నిజామాబాదులోనే ఏర్పాటు చేయడం ఇక్కడి రైతులకు అందించిన బహుమతి అని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రైతు బిడ్డ అయిన గంగారెడ్డిని చైర్మన్ చేయడం మరో విశేషం అని చెప్పారు. 29న రైతులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున రావాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా.. ఉపాధి పెరిగే విధంగా.. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా బోర్డు కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. మాజీ మంత్రి
డీఎస్ విగ్రహాన్నికూడా అమిత్ షా నిజామాబాదులో 29న
ఆవిష్కరిస్తారని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు