తెలంగాణ, 26 జూన్ (హి.స.)
హైదరాబాద్ నగరంలో బోనాల సందడి షురూ అయింది. దీనిలో భాగంగానే నేడు గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబరాలు మొదలయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారు, ఎల్లమ్మ తల్లికి ఎంపీ ఈటల రాజేందర్ గోల్కొండ జగదాంబిక ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించే భాగ్యం కలగాలని.. జాతరను అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. కాగా, నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. జులై 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు ప్రారంభం కానున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు