తెలంగాణ, ఆదిలాబాద్. 26 జూన్ (హి.స.)
ఆదిలాబాద్ మంత్రుల పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కుర్చీ ఏర్పాటు చేయకపోవడం చర్చకు దారి తీసింది. గురువారం మంత్రుల పర్యటనలో భాగంగా జడ్పీ హాల్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వేదిక పైన కూర్చున్నారు. అయితే స్టేజ్ పైన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ కోసం కుర్చీ ఏర్పాటు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆమె స్టేజ్ క్రింద అధికారుల మద్యలో ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చున్నారు. అనంతరం కాసేపటికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్,మంత్రి జూపల్లి గమనించి, వేదికపై కుర్చీ వేయించి ఎమ్మెల్యేను పైకి పిలవడంతో స్టేజీపైకి వచ్చి కూర్చున్నారు. కాగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు