అమరావతి, 26 జూన్ (హి.స.)
: ఏపీ సీఎం చంద్రబాబు ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చుపై ఆరా తీశారు. పింఛన్లు సహా సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల ఖర్చులపై చర్చించారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ