సింహగిరి పై. కొలువైన అప్పన్న స్వామి.ఆలయం ఆస్టడిగ్బంధనలో చిక్కుకుంది
అమరావతి, 26 జూన్ (హి.స.) సింహాచలం, : భక్తుల కొంగు బంగారంగా సింహగిరిపై కొలువైన అప్పన్న స్వామి ఆలయం అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. నిత్యం భక్తులతో కళకళలాడే అప్పన్న ఆలయ ప్రధాన రాజగోపుర మార్గం ఆంక్షలతో బోసిపోతోంది. గత వైకాపా ప్రభుత్వంలో ఇలాంటి ఆంక్షల ఫలితా
సింహగిరి పై. కొలువైన అప్పన్న స్వామి.ఆలయం ఆస్టడిగ్బంధనలో చిక్కుకుంది


అమరావతి, 26 జూన్ (హి.స.)

సింహాచలం, : భక్తుల కొంగు బంగారంగా సింహగిరిపై కొలువైన అప్పన్న స్వామి ఆలయం అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. నిత్యం భక్తులతో కళకళలాడే అప్పన్న ఆలయ ప్రధాన రాజగోపుర మార్గం ఆంక్షలతో బోసిపోతోంది. గత వైకాపా ప్రభుత్వంలో ఇలాంటి ఆంక్షల ఫలితాలను అనుభవించిన భక్తులు ఇప్పుడు మరోసారి స్వేచ్ఛను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింహగిరిపైకి వచ్చిన భక్తుల్లో గత కొద్ది రోజులుగా ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నలువైపులా రెయిలింగ్‌లు ఏర్పాటు వంటివి ప్రధాన ఉత్సవాల సమయంలో సహజం. అయితే సాధారణ రోజుల్లోనూ సింహగిరి మాడ వీధుల చుట్టూ సంచరించకుండా విధించిన ఆంక్షలపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రద్దీ నియంత్రణ పేరిట ఇలా చేయడం సరికాదని పేర్కొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande