అమరావతి, 26 జూన్ (హి.స.)
అమరావతి: స్పేస్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొత్తం రూ.25వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని ఆకర్షణీయంగా రూపొందించినట్టు సీఎం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5వేలు, పరోక్షంగా 30వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. స్పేస్ పరిశ్రమలకు 25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు కల్పిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. తుది పాలసీ రూపకల్పనపై సీఎం సమీక్ష చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ