అమరావతి, 27 జూన్ (హి.స.):ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ప్రభుత్వం సవరించింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ-4.0(2024-29)లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్రం మార్చిలో ఎంఎ్సఎంఈలను కొత్తగా వర్గీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోనూ ఆ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ