డిల్లీ, 27 జూన్ (హి.స.)భారత్(India)తో త్వరలో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. వైట్హౌస్లో ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయి. బహుశా భారత్తో అతిపెద్ద ఒప్పందం జరగొచ్చు’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, బీజింగ్తో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించలేదు. ఇక, ఈసందర్భంగా తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
ఏప్రిల్లో ట్రంప్ పలు దేశాలపై టారిఫ్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. అనంతరం కొన్ని రోజుల పాటు ఈ సుంకాల అమలుకు అమెరికా విరామం ప్రకటించింది. సుంకాల నేపథ్యంలో అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవడంపై భారత్ దృష్టిసారించింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు