లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు
దిల్లీ, 27 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.19 నిమిషాలకు సెన్సెక్స్‌ 136 పాయింట్లు పెరిగి 83,893 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 25,591 వద్ద ట్రేడవుతున్నాయి. హూస్టన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌, పెట్ర
లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు


దిల్లీ, 27 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9.19 నిమిషాలకు సెన్సెక్స్‌ 136 పాయింట్లు పెరిగి 83,893 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 25,591 వద్ద ట్రేడవుతున్నాయి. హూస్టన్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, అపర్‌ ఇండస్ట్రీస్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. అల్‌ఖ్యాల్‌ అమినీస్‌ కెమికల్స్‌, జేకే సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎంటీఎన్‌ఎల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నెలవారీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టులను వచ్చే 2-3 వారాల్లో తీసుకురానున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) గురువారం వెల్లడించింది. ధరల హెచ్చుతగ్గుల ముప్పును తట్టుకునేందుకు విద్యుత్‌ కొనుగోలుదారులు, విక్రేతలు, ట్రేడర్లు, పారిశ్రామిక వర్గాలు, రిటెయిలర్లకు ఈ కాంట్రాక్టులు ఉపయోగపడతాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. గురువారం ముగింపులో రూ.85.70 ఉండగా.. అది నేటి ప్రారంభానికి 85.50కు చేరింది. ఇక ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande