బీజాపూర్: , 28 జూన్ (హి.స.)ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.23 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టుల వైపు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారు.
2
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు