న్యూఢిల్లీ, 28 జూన్ (హి.స.)
అండర్ 19 యూత్ వన్డే సిరీస్లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. హోవ్లో నిన్న జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ అండర్ 19 జట్టుపై 6 వికెట్ల తేడాతో యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 పరుగులు బాది టీమిండియా విజయానికి బలమైన పునాది వేశాడు.ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్లోని రెండో వన్డే జూన్ 30న, మూడో వన్డే జూలై 2న నార్తాంప్టన్లో జరగనున్నాయి. ఆ తర్వాత జూలై 5, 7 తేదీల్లో వోర్సెస్టర్లో మరో రెండు వన్డేలు, అనంతరం రెండు నాలుగు రోజుల మ్యాచ్లు కూడా జరగనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..