న్యూఢిల్లీన 29 జూన్ (హి.స.)పాకిస్థాన్లో సైనికుల వాహనమే లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు మరణించారు. ఈ దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై భారత్ స్పందించింది. పాక్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇవి తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఆదివారం వెల్లడించారు.
శనివారం(జూన్ 28న) నాడు ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో సైనికుల వాహనం వైపునకు ఒక వ్యక్తి వేగంగా దూసుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది సైనికులు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది ఆర్మీ సిబ్బందితోపాటు 19 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ