రాజస్థాన్లో దారుణం.. మట్టి దిబ్బలు మీద పడి నలుగురు మృతి
రాజస్థాన్, 29 జూన్ (హి.స.) పైప్ లైన్ పనులు చేస్తుండగా మట్టి గుంతలో పడి నలుగురు మృతి చెందిన విషాద సంఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. నీటి పైప్ లైన్ పనులు చేస్తుండగా.. గుంతలో ఉన్న వారిపై ఒక్కసారిగా మట్టి దిబ్బలు కూలిపోయా
రాజస్థాన్ క్రైమ్


రాజస్థాన్, 29 జూన్ (హి.స.)

పైప్ లైన్ పనులు చేస్తుండగా మట్టి

గుంతలో పడి నలుగురు మృతి చెందిన విషాద సంఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. నీటి పైప్ లైన్ పనులు చేస్తుండగా.. గుంతలో ఉన్న వారిపై ఒక్కసారిగా మట్టి దిబ్బలు కూలిపోయాయి. దీంతో మట్టి దిబ్బల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో 12 మంది కార్మికులు మట్టి దిబ్బ కింద చిక్కుకున్నారు. సమాచారం అందిన వెంటనే గ్రామస్థులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటివరకు ఆరుగురిని రక్షించినట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరణించిన వారి శవాలను బయటకు తీసి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గాయపడిన వారికి చికిత్స అందించడంతో పాటు రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande