పూరి తొక్క సలాట..అధికారులపై సీఎం మోహన్ చరణ్ మారీ కఠిన చర్యలు
ఒడిశా, 29 జూన్ (హి.స.)పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిలాట ఘటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అధికారులపై సీఎం మోహన్ చరణ్ మారీ కఠిన చర్యలు తీసుకున్నారు. ప
పూరి తొక్కిసలట


ఒడిశా, 29 జూన్ (హి.స.)పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిలాట ఘటన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అధికారులపై సీఎం మోహన్ చరణ్ మారీ కఠిన చర్యలు తీసుకున్నారు. పూరీ జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీని బదిలీ చేశారు. ఈ మేరకు సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఎస్పీ వినీత్ అగర్వాల్లపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు డీసీపీ విష్ణు పాటి, కమాండెంట్ అజయ్ పాధిలను సస్పెండ్ చేశారు. పూరి జిల్లా కొత్త కలెక్టర్గా చంచల్ రాణాను, కొత్త ఎస్పీగా పినాక్ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. డెవలప్మెంట్ కమిషనర్ పర్యవేక్షణలో ఘటనపై విచారణకు సీఎం మారీ ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande