న్యూఢిల్లీ, 29 జూన్ (హి.స.)మొయిత్రా (Mahua Moitra) విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందిస్తూ సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆమె ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. భారత్లోని అన్ని పార్టీల్లో స్త్రీ ద్వేషులు ఉన్నారని రాసుకొచ్చారు. అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా తమ పార్టీ ఖండిస్తుందంటూ పేర్కొన్నారు. ఇక, మరో పోస్టులో విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందన్నారు. ఫిర్యాదు చేసిన 12 గంటల్లోపే పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ మాత్రం సహించదన్నారు. ఈ సందర్భంగా భాజపాపై కూడా విమర్శలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ