డెహ్రాడూన్, 29 జూన్ (హి.స.) భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతోంది. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదివారం నాడు అధికారికంగా ప్రకటించింది. 24 గంటలు.. అంటే ఒక రోజుపాటు ఈ యాత్రను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం వివరించింది. వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. భారీగా కొండచరియలు విరిగిపడడంతో రహదారులు వివిధ ప్రాంతాల్లో మూసుకుపోయాయని పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ