నేరాలను అరికట్టాల్సిన బాధ్యత కేవలం పోలీసులపై పెట్టడం సరికాదు: మధ్యప్రదేశ్ డీజీపీ
న్యూఢిల్లీన 29 జూన్ (హి.స.)సమాజంలో నేరాలు అత్యాచారాలు ఎక్కువవడానికి సెల్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ వాడకం పెరగడం, నైతికత తగ్గడమేనని మధ్యప్రదేశ్‌ డీజీపీ కైలాశ్ మక్వానా స్పష్టం చేశారు. పోలీసుల ఒంటరి ప్రయత్నంతో ఈ నేరాలకు అడ్డుకట్ట పడదని చెప్పారు. ఉజ్జైన్‌
నేరాలను అరికట్టాల్సిన బాధ్యత కేవలం పోలీసులపై పెట్టడం సరికాదు: మధ్యప్రదేశ్ డీజీపీ


న్యూఢిల్లీన 29 జూన్ (హి.స.)సమాజంలో నేరాలు అత్యాచారాలు ఎక్కువవడానికి సెల్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ వాడకం పెరగడం, నైతికత తగ్గడమేనని మధ్యప్రదేశ్‌ డీజీపీ కైలాశ్ మక్వానా స్పష్టం చేశారు. పోలీసుల ఒంటరి ప్రయత్నంతో ఈ నేరాలకు అడ్డుకట్ట పడదని చెప్పారు. ఉజ్జైన్‌లో డివిజనల్ రివ్యూ మీటింగ్‌ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో జనాలకు అశ్లీల కంటెంట్ సులువుగా లభిస్తోందని అన్నారు.

‘సమాజంలో నేరాలు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు కూడా కారణమే. అశ్లీల కంటెంట్, ఆల్కహాల్, సమాజంలో నైతిక విలువలు తగ్గడం వంటివన్నీ ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయి’ అని ఆయన అన్నారు. సులువుగా లభిస్తున్న అశ్లీల కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande