పహల్గామ్, 3 జూన్ (హి.స.)ప్రతిపక్షాల డిమాండ్ని తిరస్కరించిన కేంద్రం..!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కి సమాధానం ఇచ్చింది. అయితే, దీనిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్ని ప్రభుత్వ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. జూలైలో వర్షాకాల సమావేశాలు జరుగుతాయి కాబట్టి, ప్రస్తుతం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సమర్థనీయం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రతిపక్షాలకు అన్ని వివరాలు తెలియజేసినట్లు కేంద్రం చెబుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుచున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. 9 ఉగ్రస్థావరాలను నేటమట్టం చేసి 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత, పాక్ కవ్వింపులకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన 11 వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు