మరోసారి భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా
ఢిల్లీ, 3 జూన్ (హి.స.)పూర్తిగా అంతరించి పోయిందనుకున్న కరోనా (Corona) మహామ్మారి రూపాంతరం చెంది మరో కొత్త వేరియంట్ లో పంజా విసురుతుంది. నిత్యం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గత నెల మే 20 తర్వ
మరోసారి భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా


ఢిల్లీ, 3 జూన్ (హి.స.)పూర్తిగా అంతరించి పోయిందనుకున్న కరోనా (Corona) మహామ్మారి రూపాంతరం చెంది మరో కొత్త వేరియంట్ లో పంజా విసురుతుంది. నిత్యం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గత నెల మే 20 తర్వాత ఈ కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా కేళర, మహారాష్ట్ర ఈ పెరుగుదల అధికంగా ఉండగా.. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి.

తాజాగా జూన్ రెండు సోమవారం రాత్రి సమయానికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య (Number of active cases of Corona) నాలుగు వేలకు చేరిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,026 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో ఐదుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. అయితే ఈ కొత్త వేరియంట్ అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ వయసు మీద పడిన వారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. కొత్త వేరియంట్ సోకిన తర్వాత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం కాస్త ఆందోళన కలిగిస్తుంది.

కొత్త వేరియంట్ లక్షణాలు: సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, తలనొప్పి. తీవ్రమైన సందర్భాల్లో న్యుమోనియా లేదా శ్వాసకోశ సమస్యలు రావచ్చు. చాలా మంది స్వల్ప లక్షణాలతో 7-14 రోజుల్లో కోలుకుంటారు. కానీ తీవ్ర లక్షణాలు ఉంటే ఆసుపత్రి అవసరం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande