నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు
ముంబయి: , 3 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ సూచీలు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ .. వాణిజ్య ఆందోళనల కారణంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దీంతో తొలుత లాభాల్లో ప్రారంభమైన
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు


ముంబయి: , 3 జూన్ (హి.స.)దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ సూచీలు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ .. వాణిజ్య ఆందోళనల కారణంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దీంతో తొలుత లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఇప్పుడు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 153 పాయింట్ల నష్టంతో 81,184 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 51 పాయింట్ల నష్టంతో 24,664 వద్ద ఉన్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో.. అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎటర్నల్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 85.55 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 64.95 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,364 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande