అమరావతి, 30 జూన్ (హి.స.)
రాజాం, : విజయనగరం జిల్లా తెర్లాం మండలం పూనివలస పంచాయతీ జాడవారి కొత్తవలసకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధు సొంతంగా ‘ఈ-సైకిల్’ తయారుచేశాడు. అందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే సమయంలో ఉపాధ్యాయులు అటల్ టింకరింగ్ ల్యాబ్లో నేర్పిన పాఠాలతో పాటు చాట్జీపీటీ, గూగుల్ సహాయం తీసుకున్నాడు. అవసరమైన సామగ్రిని రూ.35 వేలతో కొన్నాడు. స్నేహితుడు రాజేష్తో కలిసి ఎలక్ట్రికల్ సైకిల్ రూపొందించాడు. రోజూ ఆ సైకిల్ పైనే కళాశాలకు వెళ్లి వస్తున్నాడు.
సింగిల్ ఛార్జింగ్తో 80 కి.మీ.: ఈ సైకిల్ను మూడున్నర గంటల్లో ఫుల్ ఛార్జింగ్ చేయొచ్చు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 50 కి.మీ. గరిష్ఠ వేగంతో 80 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఛార్జింగ్ అయిపోతే సైకిల్లాగే తొక్కుకుని వెళ్లొచ్చు. నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. చుట్టుపక్కల గ్రామాల వారూ కావాలని సంప్రదిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ