ముంబై, 30 జూన్ (హి.స.) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కొన్ని రోజుల క్రితంతో పోలిస్తే బంగారం ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి.. ఇటీవల లక్ష మార్క్ దాటి పరుగులు పెట్టిన పసిడి ధర వెనక్కి తగ్గుతూ వస్తోంది.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం.. డిమాండ్ తగ్గడంతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. కొన్ని రోజులక్రితం లక్షా రెండు వేలకు పైగా పెరిగిన తులం బంగారం ధర.. ఇప్పడు 97 వేలకు తగ్గింది.. అంటే దాదాపు రూ.5వేల వరకు ధర తగ్గింది. అయితే.. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.. అయితే.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.. జూన్ 30 2025 సోమవారం ఉదయం పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 97,260 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,150 గా ఉంది. 10 గ్రాముల బంగారం పై రూ.160 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ. 100 తగ్గి.. రూ.1,07,700లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి