, హైదరాబాద్: 30 జూన్ (హి.స.)
ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా కండక్టర్ల కొరత ఎక్కువగా ఉండటంతో వన్ మ్యాన్ సర్వీసులను యాజమాన్యం పెంచుతోంది. ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే బాధ్యతల్ని డ్రైవర్లకే అప్పజెబుతోంది. గతంలో ఏసీ, సూపర్లగ్జరీ వంటి నాన్స్టాప్ బస్సుల్లోనే ఈ విధానం ఉండేది. ఇప్పుడు ఎక్స్ప్రెస్లలోనూ డ్రైవర్లకే టికెట్ల జారీ బాధ్యత అప్పజెబుతున్నారు. ఈ కారణంతో అనేకచోట్ల బస్సులు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి. వన్ మ్యాన్ సర్వీసులు నడిపించే రూట్లపై డిపోల వారీగా మేనేజర్లు కసరత్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ