అమరావతి, 30 జూన్ (హి.స.)
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం, విజయవాడలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్ షాప్ (
జరగనుంది. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం (, టీసీఎస్ ( ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ పార్క్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పలువురు విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం రాత్రి వారికి విందు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ