అమరావతి, 30 జూన్ (హి.స.)
తిరుమల, : పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను టీటీడీ పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కోరినట్లు చెప్పారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టూరిజం కోటా కింద కల్పించే ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, గత డిసెంబరు నుంచి టీటీడీ ఈ కోటాను రద్దు చేసిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ