క్వాంటం వ్యాలీలో భవిష్యత్తుకు స్వాగతం..విజయవాడకు స్వాగతం: మంత్రి లోకేష్
అమరావతి, 30 జూన్ (హి.స.)ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీలకు వర్క్‌షాప్ (Workshop for Quantum Technologies) 2025ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తన ఎక్స్ కాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చే
క్వాంటం వ్యాలీలో భవిష్యత్తుకు స్వాగతం..విజయవాడకు స్వాగతం: మంత్రి లోకేష్


అమరావతి, 30 జూన్ (హి.స.)ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీలకు వర్క్‌షాప్ (Workshop for Quantum Technologies) 2025ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తన ఎక్స్ కాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో మేము అవరావతి క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్ 2025ని నిర్వహిస్తున్నందున.. భారతదేశం అంతటా, వెలుపల నుండి ఇక్కడ సమావేశమవుతున్న క్వాంటం శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, వాటాదారులకు నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

సీఎం చంద్రబాబు నాయుడి (CM Chandrababu Naidu) దార్శనిక నాయకత్వంలో, అమరావతిని క్వాంటం టెక్నాలజీలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ చారిత్రాత్మక సమావేశంలో, CM అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్‌ను ఆవిష్కరిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ను క్వాంటం ఆవిష్కరణలో ముందంజలో ఉంచడానికి ఒక బోల్డ్ బ్లూప్రింట్ గా నిలుస్తుంది. భవిష్యత్తును కలిసి రూపొందించేందుకు భవిష్యత్తుకు స్వాగతం..విజయవాడకు స్వాగతం అని మంత్రి లోకేష్ రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande