దిల్లీ, 4 జూన్ (హి.స.)నేతలు మనీశ్ సిసోదియా (Manish Sisodia), సత్యేందర్ జైన్ (Satyendar Jain)లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వీరికి సమన్లు జారీ చేసింది. ఈనెల 6న సత్యేందర్, 9న సిసోదియా దిల్లీలోని బ్యూరో కార్యాలయానికి రావాలని అందులో పేర్కొంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆప్ ప్రభుత్వ హయాంలో సిసోదియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రిగా ఉన్నారు. వారి నేతృత్వంలో దిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణంలో రూ.2వేల కోట్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. 34 మందికి దీని కాంట్రాక్టులు దక్కగా.. వారిలో చాలామందికి ఆప్తో దగ్గర సంబంధాలు ఉన్నట్లు తేలింది. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోగా, భారీగా ఖర్చు చేశారు. తరగతి గదులను 30 సంవత్సరాలు ఉండేలా కడితే.. వాటికి అయిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంది.
---------------
C
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు