హైదరాబాద్, 4 జూన్ (హి.స.)
రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారనిఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నేడు ఇందిరాపార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ధర్నా కొనసాగింది. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ, నీళ్లు ఇచ్చిన కేసీఆర్కు.. రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని సహించబోమని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబు ఏపీకి గోదావరి జలాలను తరలించుకుపోతుంటే.. మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్ను ఆపమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే ధైర్యం రేవంత్రెడ్డికి లేదా అని నిలదీశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్