రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి.. భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 4 జూన్ (హి.స.) భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు అందజేసిన వెంటనే భూ సమస్యలు పరిష్కారం చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. జూన్ 20 వరకు నిర్వహించే రెవె
భద్రాద్రి కలెక్టర్


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 4 జూన్ (హి.స.)

భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ

సదస్సులో పాల్గొని దరఖాస్తులు అందజేసిన వెంటనే భూ సమస్యలు పరిష్కారం చేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. జూన్ 20 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులలో భాగంగా లక్ష్మిదేవిపల్లి మండలం బంగారు చెలక గ్రామంలో బుధవారం నిర్వహిస్తున్న భూ భారతిలో భూ సమస్యల పై రైతులు ఇచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ రెవెన్యూ సదస్సులో భూ రికార్డులలో పేర్లు తప్పులు, భూమి విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వేనెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించి భూ భారతి కొత్త ఆర్ ఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande