రాజానగరం, 4 జూన్ (హి.స.)
, : రాజానగరం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం నర్సాపురానికి చెందిన విద్యార్థిని పరుచూరి ప్రగతి (19) మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం పోస్ట్మార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపించగా రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ ఆమెది ఆత్మహత్యేనని చెప్పారు. బలవన్మరణానికి పాల్పడే ముందు ఆమె తల్లిదండ్రులనుద్దేశిస్తూ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అందులో.. నాన్న క్షమించు, నాకు ఎందుకో తెలియదు, రెండు వారాల నుంచి ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. ఇది రాస్తున్నప్పుడు తలంతా భారంగా ఉంది. నాకు చాలా ఏడుపు వస్తోంది, ఏం చేస్తున్నానో కూడా అర్థంకావడంలేదు. అసలు నాకేమీ తెలియడం లేదు. నాన్నా.. నువ్వు చాలా బాగా చూసుకున్నావు. థ్యాంక్యూ సోమచ్, అమ్మా నాన్నను బాగాచూసుకో, నేను చనిపోయానని బాధపడకండి, మీరు అసలు ఏడవొద్దు. అక్కా నీకు త్వరగా జాబ్ రావాలి. లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతా.. అయినా మిమ్మల్సి చూస్తూనే ఉంటా.. పెద్దనాన్న, పెద్దమ్మ అందరూ బాగుండండి. అన్న నువ్వు నన్ను చాలా బాగా చూసుకువచ్చావు. థ్యాంక్యూ..
అని ఆ లేఖలో రాసి ఉండడంతో చదివి కన్నీటిపర్యంతమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ