అమరావతి, 4 జూన్ (హి.స.)
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో బుధవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం శామీర్పేటలో రంగారెడ్డి అంత్యక్రియ నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి ఆయన సన్నిహితులుగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి మృతిపట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ