అమరావతి, 4 జూన్ (హి.స.)
గుంటూరు: పోలీసులపై వైకాపా ( నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు దౌర్జన్యానికి దిగారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆయన హల్చల్ చేశారు. వైకాపా ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కలెక్టరేట్ వద్దకు అంబటి రాంబాబు వచ్చారు. కలెక్టరేట్ లోపలికి మూకుమ్మడిగా వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రతినిధి బృందాన్ని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. లోపలికి వెళ్తే ఏం చేస్తావంటూ అక్కడ ఉన్న సీఐతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. అనుమతించేది లేదని.. మర్యాదగా మాట్లాడాలంటూ సీఐ దీటుగా బదులిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ