హైదరాబాద్, 4 జూన్ (హి.స.)
గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల
నిలిచి పోయిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం బుధవారం తిరిగి పునః ప్రారంభం అయ్యింది. ముఖాముఖి కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను, సూచనలు అభిప్రాయాలను నేరుగా మంత్రులకు తెలియజేసే అవకాశం కల్పించారు. దీంతో గాంధీభవన్కు ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. వారి నుంచి భూ పంచాయతీలు, సీనియర్ సిటిజన్ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, పార్టీలో పదవులు తదితర సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి పత్రాలు స్వీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్