జోగులాంబ జిల్లాలో ఉద్రిక్తత.. ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన
తెలంగాణ, జోగులాంబ గద్వాల. 4 జూన్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం పెద్ద సంఖ్యలో పది గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా
రైతుల ఆందోళన


తెలంగాణ, జోగులాంబ గద్వాల. 4 జూన్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం పెద్ద సంఖ్యలో పది గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు కంపెనీ ప్రయత్నించడంతో మళ్లీ రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ పనులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను రైతులు ధ్వంసం చేశారు. పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు రైతులు నిప్పు పెట్టారు.

ముందస్తుగా సంఘటనా స్థలంలో పోలీసులు మోహరించినా.. రైతులు భారీ సంఖ్యలో ఉండడంతో వారిని నిలువరించలేకపోయారు. కంపెనీకి చెందిన స్థలంలో ఉన్న వాహనాలను సైతం రైతులు ధ్వంసం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande