పల్లెల్లో విడతల వారిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం.. ఎమ్మెల్యే బొజ్జు పటేల్
తెలంగాణ, మంచిర్యాల. 4 జూన్ (హి.స.) పల్లెల్లో తిరిగి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఎంపీడీవో సమావేశమాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పత్రా
ఎమ్మెల్యే బొజ్జు పటేల్


తెలంగాణ, మంచిర్యాల. 4 జూన్ (హి.స.)

పల్లెల్లో తిరిగి పేదవారికి విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఎంపీడీవో సమావేశమాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పత్రాలను బుధవారం ఆయన అందజేశారు. ఆ తర్వాత పొనకల్ సింగిల్ విండో కార్యాలయంలో జీలుగా, మేలు రకమైన వడ్ల విత్తనాలను ఆయన పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మొదటి విడతగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని, గ్రామాల్లోని అర్హులంతా అధైర్య పడకూడదని, తమ ప్రభుత్వం ఇండ్లు లేని అర్హులందరికీ తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande