నరసన్నపేట ఇచ్ఛాపురం వరకు ఆరు వరుసల దారిగా మార్చాలి
అమరావతి, 4 జూన్ (హి.స.) పాతపట్నం, : జిల్లా మీదుగా వెళుతున్న 16వ నంబరు జాతీయ రహదారిలో నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌
నరసన్నపేట ఇచ్ఛాపురం వరకు ఆరు వరుసల దారిగా మార్చాలి


అమరావతి, 4 జూన్ (హి.స.)

పాతపట్నం, : జిల్లా మీదుగా వెళుతున్న 16వ నంబరు జాతీయ రహదారిలో నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. మంగళవారం దిల్లీలో గడ్కరీతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు. నరసన్నపేట నుంచి మోహన వరకు నిర్మించిన జాతీయ రహదారి 326ఏ నిర్మాణంలో భాగంగా పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం వద్ద వయోడెక్ట్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రమైన నీలమణిదుర్గ ఆలయం వద్ద ఎర్త్‌ వాల్‌ నిర్మించడంతోఆలయానికి వెళ్లే మార్గం మూసుకుపోతుందన్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడతారని చెప్పారు. 110 మీటర్ల నిడివిలో రూ.8 కోట్ల వ్యయంతో వయోడెక్ట్‌ పనులు చేపట్టాలని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande