జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్
దిల్లీ 4 జూన్ (హి.స.)పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల పాటు విచారించి.. అనేక విషయాలు రాబట్టారు. అనంతరం పలువురు యూట్యూబర్లను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. తాజాగా జ్యోతి మల్హోత్ర
జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్


దిల్లీ 4 జూన్ (హి.స.)పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల పాటు విచారించి.. అనేక విషయాలు రాబట్టారు. అనంతరం పలువురు యూట్యూబర్లను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. తాజాగా జ్యోతి మల్హోత్రాతో సంబంధాలు ఉన్న జస్బీర్ సింగ్‌ను బుధవారం నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి.

జస్బీర్ సింగ్ ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి 1.1 మిలియన్లకు పైగా సబ్‌స్కైబర్లు ఉన్నారు. జ్యోతి మల్హోత్రాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్ మద్దతుతో ఇతడు గూఢచర్యం చేసినట్లుగా పంజాబ్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ ఐఎస్ఐ కార్యకర్త షకీర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. జస్బీర్ సింగ్.. పాకిస్థాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. ఇప్పటికే పాకిస్థాన్‌కు మూడు సార్లు వెళ్లి వచ్చినట్లుగా ఆధారాలు సేకరించారు. పాకిస్థాన్ అధికారి డానిష్‌తో కూడా సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు.

4

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande