న్యూఢిల్లీ, 4 జూన్ (హి.స.)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. మూడు నెలల విరామం తర్వాత ఉభయ సభలు ప్రారంభం అవుతున్నాయి. పార్లమెంట్ లోని లోక్సభ మరియు రాజ్యసభలలో ఉదయం 11 గంటలతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో విధానపరమైన అంశాలు, పెండింగ్లో ఉన్న చట్టాలు, రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూరపై ప్రతిపక్షాలు చర్చకు కోరే అవకాశం ఉంది..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..