తెలంగాణ, ఆదిలాబాద్. 4 జూన్ (హి.స.)
పెద్ద పులుల మనుగడ, సంరక్షణకు అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కొమరం భీం, ఆసిఫాబాద్ డివిజన్లను టైగర్ కన్జర్వేషన్ జోన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల ఆవాసంగా ఉన్న ప్రధానమైన పెద్ద పులుల కారిడార్ ను కన్జర్వేషన్ రిజర్వుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 49 జారీ చేసింది. కొమరం భీం జిల్లాలోని ఈ రెండు అటవీ డివిజన్ లు ఇప్పటివరకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోనే కొనసాగుతోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొమరం భీమ్ జిల్లాలోని ఈ రెండు డివిజన్ల అటవీ విస్తీర్ణం పరిధి 1,49,288.88 హెక్టార్లుగా విస్తరించి ఉంది. కొత్తగా ప్రభుత్వం ఆమోదించిన కన్జర్వేషన్ రిజర్వ్ అటవీ ప్రాంతం 1492.88 చదరపు హెక్టార్ల పరిధి గా విస్తరించింది. 78 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకు లుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి…పెద్దపులుల ఆవాసానికి అనువైన కాగజ్ నగర్ డివిజన్ లోని కదంబ, బెజ్జూర్, గార్లపెట్ ముఖ్యమైన కేంద్రాలుగా గుర్తించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు